Jack Edwards Injury: మార్చి 28న ఐపీఎల్ 19వ ఎడిషన్ ప్రారంభం కానున్న తరుణంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల యువ ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదని ‘క్రిక్బజ్’ (Cricbuzz) గురువారం వెల్లడించింది.
Read Also: Gulf Crisis Impact on Sports: క్రికెట్కు ‘యుద్ధం’ సెగ.. ఇంగ్లండ్లో డ్యూక్స్ బంతుల కొరత
గాయం, ఐపీఎల్ కాంట్రాక్ట్
- వేలం ధర: ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో జాక్ ఎడ్వర్డ్స్ను సన్రైజర్స్ యాజమాన్యం రూ. 3 కోట్లకు దక్కించుకుంది. ఇది అతనికి మొదటి ఐపీఎల్ ఒప్పందం.
- గాయం వివరాలు: అతనికి ఏ రకమైన గాయం అయిందనే విషయాన్ని ఫ్రాంచైజీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ కోలుకోవడానికి సమయం పడుతుండటంతో సీజన్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ ప్రస్థానం
గతేడాది ఇండియా-ఎ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా-ఎ తరపున అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన చేయడంతో జాక్ ఎడ్వర్డ్స్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
- టి20 అరంగేట్రం: ఈ ఏడాది జనవరి 29న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్తో ఆస్ట్రేలియా తరపున టి20ఐ అరంగేట్రం చేశాడు. ట్రావిస్ హెడ్ కెప్టెన్సీలో ఆడిన ఆ మ్యాచ్లో 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 5 పరుగులు చేయగా, బౌలింగ్లో 2 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు.
ఎస్ఆర్హెచ్ తదుపరి అడుగు ఏమిటి?
జాక్ ఎడ్వర్డ్స్ దూరం కావడం హైదరాబాద్ జట్టు సమతుల్యతపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అతని స్థానంలో ఎవరిని రిప్లేస్మెంట్ (Replacement) ప్లేయర్గా తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆర్సీబీతో జరగనున్న తొలి మ్యాచ్ కోసం సన్నాహాలు చేస్తున్న ఎస్ఆర్హెచ్కు ఇది మింగుడుపడని వార్తే.
రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం (Back Injury) నుండి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో, టోర్నీ ప్రారంభ మ్యాచ్లకు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నారు.
ఈ మేరకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇషాన్ కిషన్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వ్యవహరిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: