Ishan Kishan half century: నమీబియాతో(India vs Namibia) జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కిషన్ మెరుపు దాడికి తోడు, టీమిండియా పవర్ప్లేలో పరుగుల సునామీ సృష్టించి పలు రికార్డులను తిరగరాసింది.
Read Also: T20 World Cup: నేపాల్పై ఇటలీ ఘనవిజయం
20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల ఎలైట్ జాబితాలో కిషన్ చోటు సంపాదించుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురవడంతో స్టేడియం హోరెత్తిపోయింది.
Ishan Kishan half century: పవర్ప్లేలో పరుగుల వరద: 86/1
తొలి ఆరు ఓవర్లలో భారత బ్యాటర్లు పరుగుల వేట కొనసాగించారు. పవర్ప్లే ముగిసే సమయానికి భారత్ కేవలం ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు రాబట్టింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్కు ఇదే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ పవర్ప్లే స్కోరుగా నిలిచింది. క్రీజులో ఉన్నంతసేపు కిషన్ ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
మరో అరుదైన రికార్డు.. ఇషాన్ ఖాతాలో
టీ20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో పవర్ప్లే (1-6 ఓవర్ల) లోనే 50 పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిపోయాడు. విశేషమేమిటంటే, ఈ ఘనతను ఇషాన్ ఇప్పటివరకు రెండుసార్లు సాధించి తన దూకుడైన ఆటతీరును మరోసారి నిరూపించుకున్నాడు. కిషన్ ఫామ్ చూస్తుంటే భారత్ ఈ మ్యాచ్లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: