RCB team : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సందడి మొదలుకానుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనుంది.
ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు క్యాంప్లో చేరుతున్నారు. అయితే ఆర్సీబీ మాత్రం ఇంకా తమ ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించలేదు. రెండు జట్లలోనూ విదేశీ ఆటగాళ్ల సందడి ఉన్నప్పటికీ, ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ అందుబాటుపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.
అతనికి ఇంకా మెడికల్ క్లియరెన్స్ రాకపోవడంతో, అది అందే వరకు హేజిల్వుడ్ జట్టుతో కలిసే అవకాశం లేదని సమాచారం. దీంతో ఐపీఎల్ తొలి మ్యాచ్కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం విషయంలో కూడా కొన్ని అడ్డంకులు కనిపిస్తున్నాయి. 2025లో జరిగిన విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా ఈ స్టేడియం ప్రస్తుతం బీసీసీఐ నిఘాలో ఉంది. బోర్డు అధికారులు స్టేడియంను పూర్తిగా తనిఖీ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మ్యాచ్ల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also: Crude Oil Tanker: హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్తో భారత్ చేరిన నౌక
ఇటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కూడా ఆందోళనలు ఉన్నాయి. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో అతను టోర్నీలో పూర్తిగా ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
జట్టుకు ప్లస్ పాయింట్
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ప్లేయర్లు ఫామ్లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్గా మారింది. అలాగే హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టులో ఉన్నారు.
కెప్టెన్ అందుబాటులో లేకపోయినా మిగిలిన ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉండటంతో తొలి మ్యాచ్లో ఆర్సీబీపై పైచేయి సాధించాలని సన్రైజర్స్ హైదరాబాద్ పట్టుదలగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: