IPL news : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ తన ఐపీఎల్ ప్రస్థానం ప్రారంభమైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి చేరాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందుగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో అతడు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పునరాగమనంపై భావోద్వేగంగా స్పందిస్తూ, ఈ మైదానంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
Read Also:Dhurandhar 2 Collections: 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు
గతంలో జట్టునుంచి విడుదలై, వేలంలో కొనుగోలు కాలేకపోయిన షా చివరికి మళ్లీ ఢిల్లీ జట్టే అతడిని కనీస ధరకు తీసుకుంది. “కొన్ని కథలు ముగియవు.. తిరిగి వస్తాయి. ఢిల్లీ.. మీ అబ్బాయి ఇంటికి వచ్చేశాడు” అని అతడు చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేసి తనను తాను నిరూపించుకోవాలనే లక్ష్యంతో షా సిద్ధమవుతున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: