IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఆరంభానికి ముందే మూడుసార్లు ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఫాస్ట్ బౌలర్, టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. గత ఏడాది వేలంలో రూ. 1 కోటి కనీస ధరకు కేకేఆర్ ఇతడిని సొంతం చేసుకుంది. అయితే, వెన్నునొప్పి కారణంగా అతడు ఈ సీజన్లో ఆడటం లేదని ఫ్రాంచైజీ శనివారం అధికారికంగా స్పష్టం చేశాయి.
రీప్లేస్మెంట్ వేటలో కేకేఆర్
ఆకాశ్ దీప్ దూరం కావడంతో కేకేఆర్ పేస్ బౌలింగ్ విభాగం మరింత బలహీనపడింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బౌలర్ హర్షిత్ రాణా సర్జరీ కారణంగా, శ్రీలంక పేసర్ మతీశ పతిరణ భుజం గాయంతో జట్టుకు అందుబాటులో లేరు. పతిరణ ఆడటంపై శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం జట్టులో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ మరియు కార్తీక్ త్యాగి మాత్రమే స్పెషలిస్ట్ పేసర్లుగా మిగిలారు. మార్చి 18న కోల్కతాలో ప్రారంభమైన జట్టు ప్రీ-సీజన్ క్యాంపునకు కూడా ఆకాశ్ హాజరు కాలేదు.
ఖాళీ అయిన బౌలింగ్ స్థానాలను భర్తీ చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటికే ట్రయల్స్ నిర్వహిస్తూ కొత్త బౌలర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నవదీప్ సైనీ, ఆకాశ్ మధ్వాల్, సిమర్జీత్ సింగ్ వంటి పేసర్లను రీప్లేస్మెంట్గా తీసుకునే అవకాశం ఉంది. మార్చి 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో కేకేఆర్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ లోపే సరైన బౌలింగ్ వనరులను సమకూర్చుకోవడం కెప్టెన్, మేనేజ్మెంట్కు సవాలుగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :