📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Author Icon By Aanusha
Updated: March 4, 2026 • 12:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానుల నిరీక్షణకు తెరపడింది. తమ అభిమాన జట్టును సొంతగడ్డపై చూసేందుకు ఎదురుచూస్తున్న బెంగళూరు వాసులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐపీఎల్ 2026 సీజన్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎం.చిన్నస్వామి స్టేడియానికి అనుమతులు లభించాయి.

Read Also: IND vs ENG Semi Finals: ఈసారి కప్పు ఎవరిది?

సొంత గడ్డపై 5 హోమ్ మ్యాచ్‌లు

గత ఏడాది వరుస పరిణామాల నేపథ్యంలో స్టేడియంపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో రాబోయే సీజన్‌లో ఆర్సీబీ తన 5 హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి ఇది పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. అయితే, ముందస్తు ఒప్పందాల ప్రకారం మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లు మాత్రం రాయ్‌పూర్‌ వేదికగానే జరగనున్నాయి.

IPL 2026: Government gives green signal for matches at Chinnaswamy Stadium

గత విషాదం, కఠిన భద్రత

గత ఏడాది ఆర్సీబీ తొలి టైటిల్ గెలిచిన సమయంలో జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం, భద్రతా లోపాల కారణంగా స్టేడియంలో మ్యాచ్‌లను సస్పెండ్ చేసింది.దీంతో ఆర్సీబీ మరో వేదికను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, ప్రస్తుతం భద్రతా చర్యలు మెరుగుపరచడం, ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే, ఆర్సీబీ ఆడాల్సిన మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లు మాత్రం ముందస్తు ఒప్పందం ప్రకారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

chinnaswamy stadium IPL 2026 RCB

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.