हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025 : మే 29 నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్ లు ప్రారంభం

Divya Vani M
IPL 2025 : మే 29 నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్ లు ప్రారంభం

భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్‌కు బ్రేక్ పడింది. కానీ ఆ బ్రేక్ ఇప్పుడు ముగిసింది. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మే 17న లీగ్ మ్యాచ్‌లు తిరిగి స్టార్ట్ కానున్నాయి.IPL 2025 మిగిలిన లీగ్ మ్యాచ్‌లు మే 17 నుంచి మే 27 వరకూ జరుగుతాయి. ఆ తర్వాత మే 29 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయం రానుంది. మొత్తం ఆరు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

IPL 2025 మే 29 నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్ లు ప్రారంభం
IPL 2025 మే 29 నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్ లు ప్రారంభం

ప్లేఆఫ్ షెడ్యూల్ ఇదే

మే 29: క్వాలిఫయర్ -1
మే 30: ఎలిమినేటర్
జూన్ 1: క్వాలిఫయర్ -2
జూన్ 3: గ్రాండ్ ఫైనల్

లీగ్ వేదికలు డన్, ప్లేఆఫ్ మాత్రం క్లారిటీ లేదు

లీగ్ స్టేజీ వేదికలు ఖరారయ్యాయి: జైపూర్, ముంబయి, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ. కానీ ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగే వివరాలు బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.తాజా వార్తల ప్రకారం, బీసీసీఐ అహ్మదాబాద్‌లో ఫైనల్ జరపాలని చూస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2, ఫైనల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఫస్ట్ ప్లాన్ లో ఈ మ్యాచ్ కోల్‌కతాలో ఉండాల్సింది.ఈ వేదికల ఎంపిక వెనుక వాతావరణమే కీలకం. జూన్‌ ప్రారంభంలో అహ్మదాబాద్‌లో వర్షం అవకాశం తక్కువగా ఉందట. అందుకే అక్కడే ఫైనల్ పెడతారనే అంచనా.

ముంబయి, ఢిల్లీ, జైపూర్ – వీటిలో ఒకటి ఎలిమినేటర్?

క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముంబయి ఓ ఎంపికగా ఉంది. కానీ అక్కడ ఇటీవల భారీ వర్షాలు పడ్డాయి. రుతుపవనాల రాకపై ఇది ఆధారపడి ఉంటుంది.ఈ వర్ష భయాల మధ్య ఉత్తర భారత వేదికలు సేఫ్‌గా కనిపిస్తున్నాయి. జైపూర్, ఢిల్లీ వర్ష ప్రభావం తక్కువగా ఉండే చోట్లు కావడంతో అవే ఛాన్స్‌గా నిలుస్తున్నాయి.

Read Also : Kohil :కోహ్లీ యాడ్స్, ప్రొమోషన్స్ సహా అతని ఆస్తులు ఎంతో తెలుసా ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870