INDW vs AUSW 2nd ODI: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా హోబర్ట్లో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల పట్టుదలతో భారత్ ఈ స్కోరును అందుకోగలిగింది.
Read Also: Sachin Tendulkar: టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు
రాణించిన హర్మన్ప్రీత్, ప్రతీక రావల్
భారత బ్యాటర్లలో ఓపెనర్ ప్రతీక రావల్ (52) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (54) అర్ధసెంచరీతో జట్టును ఆదుకుంది. వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు కీలకమైన పునాది వేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డ్నర్, సదర్ల్యాండ్, అలిస్సా కింగ్ తలో రెండు వికెట్లు తీసి భారత పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు.

సిరీస్ నిర్ణయాత్మక దశలో
ప్రస్తుతం ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్లో ఓడిన భారత్, ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే సిరీస్ వారి సొంతమవుతుంది. సిరీస్లో చివరిదైన మూడో వన్డే మార్చి 1న జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: