టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ కొలంబోలో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు(INDvsPAK) ముందు ప్రత్యేక మ్యూజికల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రీ-మ్యాచ్ షోలో ‘ధురంధర్’ సినిమా పాటలను ప్లే చేయడంతో పాటు ప్రముఖ ర్యాపర్ హనుమాన్కైండ్ స్టేజ్పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని క్రీడా వర్గాలు వెల్లడించాయి.
Read Also: IndVsPak: అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్తో పాకిస్థాన్పై భారీ అంచనాలు
ఈ సినిమా పాక్ మరియు గల్ఫ్ దేశాల్లో నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఈ మ్యాచ్కు హాజరయ్యే పాకిస్థాన్ జట్టు సభ్యులు మరియు పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ(INDvsPAK) ఈ సంగీత కార్యక్రమాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఈ అంశం మ్యాచ్కు ముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
భారత్-పాక్ మ్యాచ్కు ముందు ఈ మ్యూజిక్ షో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచనుందని నిర్వాహకులు చెబుతున్నారు. స్టేడియం వాతావరణం మ్యాచ్ ప్రారంభానికి ముందే హైప్కి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: