
ఇటీవల జరిగిన T20 ప్రపంచ కప్లో విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు తిరుమల (Tirumala) చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంది. తొలి T20 ప్రపంచ కప్ను గెలిచి చరిత్ర సృష్టించిన అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందేందుకు జట్టు సభ్యులు తిరుమలకు విచ్చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జట్టు సభ్యులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. దేశానికి ప్రపంచ కప్ అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, ఈ విజయం వెనుక జట్టు కృషి, క్రమశిక్షణతో పాటు దేశ ప్రజల ఆశీర్వాదాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
Read Also: T20 WC: భారత్తో మ్యాచ్ బాయ్కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: