భారత్, దక్షిణాఫ్రికా (Ind vs SA) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన మూడో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరుజట్లు చెరో విజయం సాధించాయి.
Read Also: IND vs PAK: పాక్తో మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
ఈ నేపథ్యంలో (Ind vs SA) సిరీస్లో ఆధిక్యం సాధించాలంటే ఈ మ్యాచ్లో గెలవడం ఇరు జట్లకు ఎంతో కీలకం. దీంతో ఈ పోరుపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్ క్రమ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు పటిష్టమైన లైనప్తో బరిలోకి దిగుతున్నాయి.

భారత జట్టు
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా జట్టు
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్కియా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మన్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: