Ind vs Nam : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత జట్టు నమీబియాతో కీలక మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టోర్నీలో 18వది. భారత జట్టులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఉండడంతో జట్టు బలంగా కనిపిస్తోంది. గాయపడిన అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం లభించగా, మహమ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇచ్చి బుమ్రాను తుది జట్టులో చేర్చారు.
Read Also: ICC: ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి
టాస్ అనంతరం ఎరాస్మస్ మాట్లాడుతూ, “వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఛేదన చేయాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు. మరోవైపు సూర్యకుమార్ మాట్లాడుతూ, “ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. టాస్ ఓడినా పరవాలేదు, మ్యాచ్ గెలవడమే ముఖ్యం” అని ధైర్యం వ్యక్తం చేశాడు.
కాగితంపై భారత్ బలంగా ఉన్నప్పటికీ, టీ20 ఫార్మాట్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి గ్రూప్ దశలో ఆధిక్యం సాధించాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: