India vs England U19: అండర్-19 ప్రపంచకప్ తుది పోరులో భారత యువ జట్టు రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలింగ్ ధాటికి తడబడుతున్నారు. ఇప్పటికే భారత బౌలర్లు విజృంభించడంతో 23 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీపేష్ రెండు వికెట్లతో చెలరేగగా.. అంబరీష్, ఖిలాన్ పటేల్, కనిష్క్, మరియు ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసి భారత్ను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. అయితే మ్యాచ్ ఇంకా కొనసాగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Also: FB Hack: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్
ఈ మ్యాచ్లో భారత్ ఇప్పటికే పలు చారిత్రాత్మక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అండర్-19 వరల్డ్ కప్(India vs England U19) ప్లేఆఫ్స్ దశలో 350 ప్లస్ స్కోరు సాధించిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా, ఈ టోర్నీ చరిత్రలో మూడుసార్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. వ్యక్తిగత రికార్డుల పరంగా చూస్తే, యువ బ్యాటర్ వైభవ్ అసాధారణ ఫామ్ను ప్రదర్శిస్తున్నాడు. కేవలం 25 యూత్ వన్డే ఇన్నింగ్స్లలోనే 110 సిక్సర్లు బాది క్రికెట్ లోకాన్ని విస్మయానికి గురిచేశాడు.
టోర్నీ ఆద్యంతం భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూనే ఉంది. అఫ్గానిస్థాన్తో జరిగిన సెమీఫైనల్లో 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఈ టోర్నీలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు ఇదే జోరును కొనసాగిస్తే, భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. యువ భారత్ ప్రదర్శిస్తున్న ఈ పోరాట పటిమ భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: