ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు (Indian team on English soil) చరిత్ర సృష్టించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత్ ఘనవిజయం నమోదు చేసింది. 58 ఏళ్లుగా ఇక్కడ గెలుపు కోసం ఎదురుచూస్తున్న టీమిండియా, చివరికి 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.ఇంగ్లండ్ 608 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్కు దిగింది. కానీ యువ పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) మంటలేస్తూ ప్రత్యర్థి బ్యాటింగ్ను కుదేలు చేశాడు. 6 వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్ని ఒక్కసారిగా మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనూ అతడు 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద మ్యాచ్లో 10 వికెట్లు తీసి తన టాలెంట్ను చాటాడు.
బ్యాటింగ్లో గిల్ డబుల్ సెంచరీతో మెరుపులు
టీమిండియా తొలి ఇన్నింగ్స్లోనే దుమ్ముదులిపింది. కెప్టెన్ గిల్ 269 పరుగులతో డబుల్ సెంచరీ చేయగా, జడేజా 89, జైస్వాల్ 87 పరుగులు చేశారు. దీంతో భారత్ 587 పరుగుల భారీ స్కోరు చేసింది.ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో బ్రూక్ 158, స్మిత్ 184 పరుగులతో పోరాడినా ఫలితం లేదు. సిరాజ్ 6 వికెట్లు తీసి ప్రత్యర్థిని 407 పరుగులకే కట్టడి చేశాడు.
రెండో ఇన్నింగ్స్లో మరోసారి భారత్ ఆధిపత్యం
భారత్ రెండో ఇన్నింగ్స్ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. గిల్ మరోసారి 161 పరుగులతో రాణించాడు. పంత్ 65, జడేజా 69* తో మద్దతు ఇచ్చారు.కీలక బౌలర్ బుమ్రా లేని పరిస్థితిలో గిల్ సేన ఈ గొప్ప విజయాన్ని సాధించింది. గిల్ కెప్టెన్గా తన తొలి గెలుపును ఖాతాలో వేసుకున్నాడు. ఇది అతని నాయకత్వానికి నూతన శక్తిని ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తదుపరి టెస్టు లార్డ్స్లో – గెలుపు జోరును కొనసాగించాలన్న లక్ష్యం
ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జులై 10న లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఇప్పుడు భారత్ సిరీస్ను సమం చేయడమే కాకుండా, మనోధైర్యాన్ని మరింతగా పెంచుకుంది.ఇతిహాసం చెరిపేసిన గిల్ సేన – ఇది సాధారణ గెలుపు కాదు. ఇది ఎడ్జ్బాస్టన్లో ఓ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు. ఇప్పుడు భారత్ మూడో టెస్టులో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also : Alcohol : మద్యం మానేస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే!