మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ (Women’s ODI Cricket World Cup) లో భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య నేడు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీ స్టేడియం (ACA-VDC Stadium) లో కీలక మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్, (India vs Australia) ఫాన్స్ లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy) టాస్లో విజయం సాధించి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాత్రి సమయంలో తక్కువ ఉష్ణోగ్రత, మంచు ప్రభావం బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు.
Upasana: నేనేమీ అథ్లెట్ ను కాను: ఉపాసన
జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. సోఫీ మోలినెక్స్ (Sophie Molyneux) తిరిగి వచ్చింది, కాగా వారెహామ్ స్థానం కోల్పోయింది. కీలక మ్యాచ్ల్లో విజయం సాధించడం ముఖ్యం. కానీ భారత్ లాంటి బలమైన జట్టును ఎదుర్కొనేటప్పుడు మేము అన్ని విభాగాల్లో సమష్టిగా ఆడాలి.
2011 తర్వాత విశాఖపట్నంలో ఆడటం నాకు ఇదే మొదటిసారి. ఇక్కడ అద్భుతమైన వాతావరణంతో పాటు ఆస్ట్రేలియాకు మద్దతు కూడా ఉంది. మా అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు” అని అన్నారు.టాస్ ఓడిపోయినప్పటికీ భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తమ జట్టుపై విశ్వాసం వ్యక్తం చేసింది.
హర్మన్ప్రీత్ కౌర్ తమ జట్టుపై విశ్వాసం వ్యక్తం చేసింది
“ఈ పిచ్ గత మ్యాచ్లోని పిచ్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. అందుకే మేము అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాము. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేది ముఖ్యం. గత మ్యాచ్లో మేము 95 ఓవర్ల పాటు పోటీలో ఉన్నాం.
అది మాకు చాలా సానుకూల అంశం. అభిమానుల మద్దతు మాకు ఎప్పుడూ ముఖ్యం, ఇది మా జీవితంలో లభించిన గొప్ప అవకాశం” అని హర్మన్ప్రీత్ అన్నారు.ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI:
అలిస్సా హీలీ (కెప్టెన్ & వికెట్ కీపర్),
ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డనర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్ , అలానా కింగ్, మేగాన్ షుట్ఇండియా ప్లేయింగ్ XI:ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: