భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ నేటి నుండి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కాన్బెరాలో జరగనుంది.ముఖ్యంగా భారత జట్టులో మారిన కోచింగ్ సెటప్ ఈ సిరీస్లో పెద్ద పరీక్షను ఎదుర్కొనబోతోంది. టీమిండియా కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కు ఇది మొదటి పెద్ద సవాలుగా భావిస్తున్నారు.
Read Also: IND vs AUS: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడి పోరు!
గంభీర్ నేతృత్వంలో భారత్ ఇటీవల ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీలను గెలిచి మంచి ఊపుమీద ఉంది. కానీ ఆస్ట్రేలియా పర్యటన మాత్రం ఎప్పుడూ కఠినమైనదే. గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు భారత్ రెండు సిరీస్ల్లో ఆస్ట్రేలియాతో ఓటమిని చవిచూసింది. అందుకే ఈసారి ఆ పరాజయ హ్యాట్రిక్ను నివారించడం ఆయనకు ప్రధాన లక్ష్యం. కేవలం ఆటగాళ్లే కాకుండా, కోచ్ గంభీర్ కూడా ఈ సిరీస్పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

భారత్ మొదటి మ్యాచ్ను 295 పరుగుల తేడాతో గెలిచి
భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా నియమితులైన తర్వాత గౌతమ్ గంభీర్కు ఆస్ట్రేలియాపై మొదటి టెస్ట్ సిరీస్ బీజీటీ (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)గా నిలిచింది. భారత్ మొదటి మ్యాచ్ను 295 పరుగుల తేడాతో గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా మిగిలిన 4 మ్యాచ్లలో 3 గెలిచి సిరీస్ను 3-1 తేడాతో తమ సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
బార్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్ ఆస్ట్రేలియాపై రెండో సిరీస్ను వన్డే ఫార్మాట్లో ఆడింది, ఇది కూడా ఇదే పర్యటనలో భాగం. ఇందులో కూడా భారత్ ఓడిపోయింది, ఆస్ట్రేలియా సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్ వంతు వచ్చింది. తను కోచ్గా ఉన్నప్పుడు భారత్ ఆస్ట్రేలియా చేతిలో వరుసగా 3 సిరీస్లు ఓడిపోకూడదని గంభీర్ కోరుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: