India vs pakistan cancelled : భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్ అభిమానులకు పండుగలాంటిదే. అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగాల్సి ఉండగా, పాకిస్థాన్ బహిష్కరణ నిర్ణయం శ్రీలంక పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా మారింది. వేలాది మంది అభిమానులు, మీడియా ప్రతినిధులు, స్పాన్సర్లు రావాల్సి ఉండటంతో నగరం ముందుగానే హోటల్ బుకింగ్లతో కిక్కిరిసిపోయింది.
అయితే తాజా అనిశ్చితితో ఒక్కసారిగా బుకింగ్లు రద్దవుతున్నాయి. స్టార్ హోటళ్ల నుంచి చిన్న లాడ్జీల వరకు క్యాన్సిలేషన్లు పెరిగిపోయాయి. ప్రత్యేక ఫ్లైట్లు నడిపేందుకు సిద్ధమైన విమానయాన సంస్థలు, టూర్ ఆపరేటర్లు కూడా భారీ నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.
Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్న శ్రీలంకకు టూరిజమే ప్రధాన ఆదాయం. ఈ మ్యాచ్ ద్వారా కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని భావించిన లంకకు ఇది పిడుగులాంటి వార్త. ఈ అంశంపై Sri Lanka Cricket తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నష్టాల విషయాన్ని International Cricket Council దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది.
మ్యాచ్ పూర్తిగా రద్దయితే షెడ్యూల్ మార్పులు లేదా ప్రత్యామ్నాయ ఈవెంట్ నిర్వహణపై ఐసీసీ ఆలోచిస్తోంది. అవసరమైతే ఆర్థిక నష్టాలను పాక్ బోర్డు నుంచి వసూలు చేసే అవకాశమూ ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: