ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 6 వికెట్లకు 204 పరుగులు (India 204 for 6 wickets) చేసింది. ఇంగ్లండ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి భారత కీలక బ్యాటర్లను పెవిలియన్ చేరేశారు.పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ 2 వికెట్లు, జోష్ టంగ్ 2 వికెట్లు, వోక్స్ ఒక వికెట్ తీశారు.
కరుణ్ నాయర్ అర్ధశతకం
మొదటి మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ నాలుగో టెస్టులో ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఆడి అద్భుతంగా రాణించాడు. సాయి సుదర్శన్ (38)తో భాగస్వామ్యం చేసి భారత్ను ఆదుకున్నాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ (19 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్కు 51 పరుగులు జోడించాడు.భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో టాప్ స్కోరర్. ఐదో టెస్టులో 11 పరుగులు చేసిన గిల్ ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా నిలిచాడు. అతని ఖాతాలో ఇప్పుడు 743 పరుగులు ఉన్నాయి.
గవాస్కర్ రికార్డు బద్దలైంది
గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1978-79 సిరీస్లో గవాస్కర్ 732 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 2016-17లో ఇంగ్లండ్పై 655 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.కరుణ్ నాయర్ (Karun Nair) 52 నాటౌట్తో నిలిచి భారత్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. వాషింగ్టన్ సుందర్తో అతడి భాగస్వామ్యం భారత్కు ఊరట కలిగించింది. రెండో రోజు ఆటలో ఈ జంట ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.
Read Also : YS Jagan : జగన్ నెల్లూరు పర్యటనపై మూడు కేసులు నమోదు