Latest News: IND W vs PAK: పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం

Read Time:  1 min
IND W vs PAK
IND W vs PAK
FONT SIZE
GET APP

ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 (ICC Women’s World Cup 2025)లో భారత మహిళా క్రికెట్ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దాయాది దేశం పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి అభిమానులను ఉత్సాహపరిచింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం (R Premadasa Stadium) లో జరిగిన ఆరో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ఉమెన్ ఇన్ బ్లూ అద్భుత ప్రదర్శనతో 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

IND W vs PAK: టాస్ ఓడిన భారత్

ఈ గెలుపుతో భారత జట్టు టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు, పాకిస్థాన్‌కు ఇది రెండో వరుస పరాజయం కావడం గమనార్హం. వన్డే ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై భారత్ తరచూ గెలుపొందుతూనే ఉంది.

ఇప్పటివరకు జరిగిన 12 వన్డేల్లోనూ టీమిండియాదే పైచేయి కావడం విశేషం.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు (Indian Women’s Team) నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46) సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించింది.

స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (23) త్వరగా ఔట్ కావడంతో

ఓపెనర్ ప్రతీకా రావల్ (31) డయానా బేగ్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చినా, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) (23) త్వరగా ఔట్ కావడంతో టాపార్డర్‌పై ఒత్తిడి పెరిగింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది.

IND W vs PAK
IND W vs PAK

భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46) సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (31) డయానా బేగ్ (Diana Baig)  బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చినా,

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థా

స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (23) త్వరగా ఔట్ కావడంతో టాపార్డర్‌పై ఒత్తిడి పెరిగింది.248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు, భారత బౌలర్ల ముందు తలవంచింది. 43వ ఓవర్‌లోనే కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.

పాకిస్తాన్ బ్యాటర్లలో సిద్రా అమీన్(81), నటాలియా పర్వేజ్(33) తప్ప మిగతా వారెవరూ రాణించలేదు. భారత బౌలర్లు క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.ఇండియా: 247/10,పాకిస్థాన్: 159/10

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.