IND vs ZIM: క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ఉంటే మెట్రో ప్రయాణం ఫ్రీ!

Read Time:  1 min
India semifinal chances
India semifinal chances
FONT SIZE
GET APP

IND vs ZIM: చెన్నైలో నేడు (ఫిబ్రవరి 26) జరగనున్న భారత్ – జింబాబ్వే కీలక మ్యాచ్‌ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు చెన్నై మెట్రో రైల్వే లిమిటెడ్ (CMRL) అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. చెపాక్‌లోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు హాజరయ్యే టికెట్ హోల్డర్లకు మెట్రో ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేసింది. మ్యాచ్ టికెట్‌ను మెట్రో పాస్‌గా వాడుకునే వీలు కల్పించడం విశేషం.

Read Also: Arjun Tendulkar Marriage: వివాహ బంధంలోకి అర్జున్ టెండూల్కర్

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. ప్రయాణం సాగించండి

ఈ సదుపాయాన్ని పొందడానికి అభిమానులు విడిగా ఎలాంటి టోకెన్ లేదా మెట్రో కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫిజికల్ లేదా డిజిటల్ మ్యాచ్ టికెట్‌పై ఉన్న ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను మెట్రో స్టేషన్‌లోని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల వద్ద స్కాన్ చేస్తే సరిపోతుంది. చెన్నైలోని ఏ మెట్రో స్టేషన్ నుంచైనా స్టేడియానికి దగ్గరగా ఉండే గవర్నమెంట్ ఎస్టేట్ (Government Estate) మెట్రో స్టేషన్ వరకు వెళ్లి రావడానికి ఒకసారి ‘రౌండ్ ట్రిప్’ ప్రయాణించవచ్చు.

స్టేడియంలో భారీగా ప్రేక్షకులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే ఈ చర్య లక్ష్యంగా సీఎంఆర్‌ఎల్ స్పష్టం చేసింది.మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అభిమానులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక లేట్‌నైట్ సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి మెట్రో సేవలు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగనున్నాయి. చివరి రైళ్లు గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ నుంచి ఒకటి విమ్కో నగర్ డిపో వైపు, మరోటి ఎయిర్‌పోర్ట్ లైన్ వైపు బయలుదేరనున్నాయి.

IND vs ZIM: Bumper offer for cricket fans.. Free metro travel if you have a ticket!
IND vs ZIM: Bumper offer for cricket fans.. Free metro travel if you have a ticket!

ముందుగానే ప్లాన్ చేసుకోవాలి

రాత్రి 11 గంటల తర్వాత గ్రీన్ లైన్ మార్పిడిపై పరిమితులు విధించారు. ఈ సమయంలో గ్రీన్ లైన్‌కు మారాల్సిన ప్రయాణికులు కేవలం చెన్నై సెంట్రల్ స్టేషన్‌లోనే మారాలి. అలాగే చివరి రైలు బయలుదేరే సమయానికి 10 నిమిషాల ముందే గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్‌లో ప్రవేశాన్ని మూసివేస్తారని మెట్రో అధికారులు తెలిపారు. అందుకే ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌తో కలిసి అమలు చేస్తున్నట్లు సీఎంఆర్‌ఎల్ వెల్లడించింది. మ్యాచ్ రోజున అభిమానుల టికెట్లే మెట్రో టికెట్లుగా పనిచేస్తాయని, ఈ ప్రయాణ ఖర్చును ఈవెంట్ నిర్వాహకులే భరిస్తారని స్పష్టం చేసింది. ఇది అభిమానులకు సౌకర్యంతో పాటు నగరంలో ట్రాఫిక్ భారం తగ్గించడంలో కూడా సహాయపడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.