వెస్టిండీస్తో (IND vs WI) జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం. నాలుగో రోజు ఆటలో టీమిండియా 121 పరుగుల లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నంలో ఉందని స్పష్టమైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.
Read Also: Shubhman Gill: టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు
అంటే, విజయానికి ఇంకా 58 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు 173/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆలౌటైంది. జాన్ కాంప్బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీలతో చెలరేగగా..
జస్టిన్ గ్రీవ్స్(85 బంతుల్లో 3 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ (Half century) తో రాణించాడు.వెస్టిండీస్ను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చారు. ముఖ్యంగా జాన్ కాంప్బెల్, షైహోప్ జోడీని విడదీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
బ్యాటింగ్కు అనుకూలం
తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తీవ్రంగా అలసి పోయారు. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మారడం విండీస్కు కలిసొచ్చింది. కాంప్బెల్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు.
సెంచరీ అనంతరం కాంప్బెల్ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో వెస్టిండీస్ 252/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.రెండో సెషన్లో షైహోప్ 204 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) క్లీన్ బౌల్డ్ చేయడంతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. రోస్టన్ చేజ్(40), టెవిన్ ఇమ్లాచ్(12), ఖారీ పీర్రె(0)లను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. జోమెల్ వార్రికన్(3), అండర్సన్ ఫిలిప్(2)లను బుమ్రా పెలియన్ చేర్చాడు.
ఈ పరిస్థితుల్లో జైడెన్ సీల్స్తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ పోరాడాడు. దాంతో విండీస్ 361/9 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది. ఆఖరి సెషన్లోనూ ఈ జోడీ సాధికారికంగా ఆడింది. ముఖ్యంగా జస్టీన్ గ్రీవ్.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. జైడెన్ సీల్స్ను బుమ్రా ఔట్ చేయడంతో వెస్టిండీస్ పోరాటం ముగిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: