📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs WI: గెలుపుకి దగ్గర లో టీమిండియా

Author Icon By Aanusha
Updated: October 13, 2025 • 6:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెస్టిండీస్‌తో (IND vs WI) జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం. నాలుగో రోజు ఆటలో టీమిండియా 121 పరుగుల లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నంలో ఉందని స్పష్టమైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.

Read Also: Shubhman Gill: టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

అంటే, విజయానికి ఇంకా 58 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు 173/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. జాన్ కాంప్‌బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103) సెంచరీలతో చెలరేగగా..

జస్టిన్ గ్రీవ్స్(85 బంతుల్లో 3 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ (Half century) తో రాణించాడు.వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చారు. ముఖ్యంగా జాన్ కాంప్‌బెల్, షైహోప్ జోడీని విడదీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

IND vs WI

బ్యాటింగ్‌కు అనుకూలం

తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తీవ్రంగా అలసి పోయారు. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం విండీస్‌కు కలిసొచ్చింది. కాంప్‌బెల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.

సెంచరీ అనంతరం కాంప్‌బెల్‌ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో వెస్టిండీస్ 252/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.రెండో సెషన్‌లో షైహోప్ 204 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) క్లీన్ బౌల్డ్ చేయడంతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రోస్టన్ చేజ్(40), టెవిన్ ఇమ్లాచ్(12), ఖారీ పీర్రె(0)లను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. జోమెల్ వార్రికన్(3), అండర్సన్ ఫిలిప్(2)లను బుమ్రా పెలియన్ చేర్చాడు.

ఈ పరిస్థితుల్లో జైడెన్ సీల్స్‌తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ పోరాడాడు. దాంతో విండీస్ 361/9 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆఖరి సెషన్‌లోనూ ఈ జోడీ సాధికారికంగా ఆడింది. ముఖ్యంగా జస్టీన్ గ్రీవ్.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. జైడెన్ సీల్స్‌ను బుమ్రా ఔట్ చేయడంతో వెస్టిండీస్ పోరాటం ముగిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News India vs West Indies latest news second Test match Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.