భారత్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా (IND vs SA) 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓ దశలో 57/0తో పటిష్ట స్థితిలో నిలిచిన ప్రొటీస్ టీమ్.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది.
Read Also: IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్
దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు
55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా .. ఐదు వికెట్లతో సత్తాచాటాడు. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా,తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
బుమ్రా (5/27) తన అద్భుతమైన బౌలింగ్తో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సఫారీ జట్టులో ఐడెన్ మార్క్రమ్ (31) టాప్ స్కోరర్గా నిలిచాడు.దీంతో తొలి సెషన్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు కూడా ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మార్కో యన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్తో కలిసి కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఆట ముగిసే సమయానికి రాహుల్ (13), సుందర్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 122 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు భారత బ్యాటర్లు రాణిస్తే మ్యాచ్పై పూర్తిగా పట్టు సాధించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: