📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs SA: రెండో టెస్టు.. కష్టాల్లో టీమిండియా

Author Icon By Anusha
Updated: November 24, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గువాహటి టెస్టులో టీమిండియా డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. టీమిండియా బౌలింగ్‌లో తేలిపోవడంతో దక్షిణాఫ్రికా (IND vs SA) తమ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్థితిలో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు రాణించడంతో సఫారీ జట్టు 489 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇక రెండో రోజు చివరి సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. వికెట్లేమీ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.

Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం!

IND vs SA: Second Test.. India in trouble

పీకల్లోతు కష్టాల్లో

మూడో రోజు (సోమవారం) ఉదయం బ్యాటింగ్‌ ప్రారంభించిన కాసేపటికే టీమ్‌ఇండియాకు షాక్‌ తగిలింది. చకచకా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 21.3వ ఓవర్‌లో కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (22) ఐడెన్‌ మార్‌క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

మరో ఎండ్‌లో మంచి ఊపులో ఉన్నట్లు కనిపించిన యశస్వీ జైస్వాల్‌ 85 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే జట్టు స్కోరు 95 వద్ద జైస్వాల్‌ (58) సైబన్‌ ఆర్మర్‌ బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంది వచ్చిన మంచి అవకాశాన్ని సాయి సుదర్శన్‌ మరోసారి చేజార్చుకున్నాడు. మరోసారి స్వల్ప స్కోర్‌కే (15) పెవీలియన్‌కు చేరాడు.

ఇక ఆదుకుంటానుకున్న ద్రువ్‌ జురెల్‌ కూడా డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్‌ రిషభ్‌ పంత్ (6)‌, రవీంద్ర (0) క్రీజులో ఉన్నారు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. మరో 387 పరుగులు వెనకబడింది.ప్రస్తుతం క్రీజులో పంత్, జడేజా ఉన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

India vs South Africa Indian Batting Collapse Jaiswal fifty latest news second Test match Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.