📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs SA: మూడో వన్డేలో భారత్ విజయం

Author Icon By Aanusha
Updated: December 6, 2025 • 11:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ (IND vs SA) ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.  విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, 9 వికెట్ల తేడాతో అలవోకగా ఛేదించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

Read Also: IND vs SA: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ముగ్గురు ప్లేయర్లు ఔట్

నిర్ణయాత్మక మూడో వన్డేలో (IND vs SA) టీమిండియా ముందు దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్, జైశ్వాల్ జోడీ.. రన్ ఛేజ్‌ను ఏకపక్షంగా మార్చింది. ఈ సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని..జైశ్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీ కొట్టాడు.

వన్ డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ.. పరుగుల వరద కంటిన్యూ చేశాడు. అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.తొలుత నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన జైశ్వాల్.. చివర్లో వేగం పెంచాడు. 111 బంతుల్లో మూడంకెల మార్కు అందుకున్నాడు. 23 ఏళ్ల జైశ్వాల్‌కు ఇది నాలుగో వన్డే మ్యాచ్ కాగా తొలి వన్డే శతకం సాధించాడు. రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేశాక ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టీ20 తరహాలో సత్తాచాటాడు.

IND vs SA: India win in the second ODI

కోహ్లీ లాంటి సీనియర్ల రాక

40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. మరో 5 బంతుల్లో మరో 15 పరుగులు స్కోరు చేశాడు. జైశ్వాల్.. 121 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ 45 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో టీమిండియా 39.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

దీంతో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కానీ తాజాగా రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ల రాకతో భారత్.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

IND vs SA ODI series India vs South Africa India win 2-1 Kuldeep Yadav latest news prasidh krishna Telugu News Vizag final ODI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.