సౌతాఫ్రికాతో ఐదు టీ20ల (T20) సిరీస్కు టీమిండియా సిద్దమైంది. నేడు కటక్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాల సన్నదమైంది. గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు.
Read Also: Messi Hyderabad Schedule : మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..

రికార్డ్ సృష్టించనున్న బుమ్రా
సౌతాఫ్రికాతో, భారత్ 5 మ్యాచుల T20 (T20) సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్లో జరగనుంది. ఇది బ్యాటర్లకు అనుకూలించే పిచ్ కావడం, 2 జట్లలో హిట్టర్లు ఉండటంతో హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశముందని క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2015, 2022లో ఇక్కడ సౌతాఫ్రికాతో, భారత్ ఆడిన 2 T20ల్లోనూ ఓడింది. అటు ఇవాళ ఓ వికెట్ తీస్తే 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా రికార్డ్ సృష్టించనున్నారు. 7PMకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: