భారత్తో జరుగుతున్న రెండో టెస్టు (IND vs SA 2nd Test) పై హైప్ ఉంది. రెండో టెస్ట్లోనూ సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారీ స్కోర్ నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మేం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాం.
Read Also: Aus Vs Eng: స్టార్క్ స్టన్నింగ్ క్యాచ్
టాస్ ఓడిన టీమిండియా
పిచ్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం. పిచ్పై ఎలాంటి పగుళ్లు లేవు. ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ చారిత్రాత్మక సిరీస్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. ముత్తుసామీ జట్టులోకి వచ్చాడు.’అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.
వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. కెప్టెన్ మారినా టీమిండియాకు కలిసిరాలేదు. ఈ మ్యాచ్లోనూ భారత్ టాస్ ఓడింది. టాస్ ఓడినా పెద్ద సమస్య ఏం లేదని రిషభ్ పంత్ (Rishabh Pant) తెలిపాడు. భారత టెస్ట్ టీమ్కు సారథ్యం వహించడం గర్వించదగిన విషయమని సంతోషం వ్యక్తం చేశాడు.

తుది జట్లు:
సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సిమోన్ హార్మర్, మార్కో జాన్సెన్, సెనరన్ ముత్తుసామీ, కేశవ్ మహారాజ్
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: