📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs AUS: ఐదవ T20లో.. టాస్ ఓడిన టీమిండియా

Author Icon By Anusha
Updated: November 8, 2025 • 2:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. ఈ కీలక పోరులో టాస్ అదృష్టం ఆతిథ్య జట్టైన ఆస్ట్రేలియాకు కలిసివచ్చింది.

Read Also: Haseen Jahan: షమీ మాజీ భార్య భరణం పెంపుపై వివాదం

కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌ (IND vs AUS) ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

టాస్ గెలిచిన అనంతరం మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి మంచి పిచ్‌లా కనిపిస్తోంది. ఈ గొప్ప స్టేడియంలో ఆడటం ఎప్పుడూ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ సిరీస్‌ను డ్రా చేసేందుకు ఈ మ్యాచ్‌ మాకు మంచి అవకాశం. ఈ సిరీస్‌లో ఇప్పటికే చాలా ఆడాం.

ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడం ఎప్పుడూ మంచిదే

ఇరు జట్లు గొప్ప ప్రదర్శన చేసాయి. గత మ్యాచ్‌లో పిచ్ కండిషన్స్ విభిన్నంగా ఉన్నాయి. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్‌ పరిస్థితులు వేరు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.’అని మిచెల్ మార్ష్ (Mitchell Marsh) చెప్పుకొచ్చాడు.

IND vs AUS

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. “టాస్‌లు ఓడినా మ్యాచ్‌లు గెలిచినంత కాలం ఫర్వాలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడం ఎప్పుడూ మంచిదే. అయితే, జట్టు లక్ష్యాలను అర్థం చేసుకోవడం, ఆటగాళ్ల పాత్రలపై స్పష్టత ఇవ్వడం మాకు ముఖ్యం. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఒక మార్పు చేశాం. తిలక్ వర్మకు విశ్రాంతినిచ్చి, రింకూ సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నాం” అని వివరించాడు.

తుది జట్లు

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: మాట్ షార్ట్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

5th T20 2025 Breaking News Brisbane T20 India vs Australia latest news Mitchell Marsh Suryakumar Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.