📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs AUS: ఆసీస్‌తో ఆఖరి టీ20 .. టీమిండియా తుది జట్టు ఇదే!

Author Icon By Anusha
Updated: November 7, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ (T20 series) లో ప్రస్తుతం టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే నాలుగో టీ20లో అద్భుత విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శనివారం బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఐదవ, తుది మ్యాచ్ ఈ సిరీస్‌కు కీలకం కానుంది. ఈ పోరులో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.

Read Also: Mohammed Shami: షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

మరోవైపు యాషెస్ సిరీస్ నేపథ్యంలో సీనియర్లు దూరమైన వేళ యువ ప్లేయర్లతో ఆడుతున్న ఆసీస్.. సిరీస్ సమం చేయడంపై కన్నేసింది. టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) సన్నాహకంలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు సంజూ శాంసన్‌‌ (Sanju Samson) ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

ఈ ఇద్దరి కోసం వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) తో పాటు శివమ్ దూబేకు విశ్రాంతి ఇవ్వవచ్చు.టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్‌ను టీమిండియా ప్రయోగాలకు ఉపయోగించుకుంది. హర్షిత్ రాణా, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్‌లను తొలి రెండు టీ20ల్లో ఆడించగా.. జట్టు అంచనాలను అందుకోలేకపోయారు.

IND vs AUS

ఈ ముగ్గురిపై వేటు వేసిన గంభీర్

దాంతో మూడో టీ20లో ఈ ముగ్గురిపై వేటు వేసిన గంభీర్.. జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అవకాశాలు కల్పించింది. ఈ ముగ్గురు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. నాలుగో టీ20లో జితేశ్, సుందర్ విఫలమైనా.. ఆఖరి మ్యాచ్‌లో కొనసాగించనున్నారు.రెండు మినహా తుది జట్టులో భారీగా మార్పులు జరిగే అవకాశం లేదు.

బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా సూర్య వైఫల్యం విమర్శలకు దారి తీస్తోంది. బౌలింగ్ బాధ్యతలను జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ,వాషింగ్టన్ సుందర్‌లు పంచుకోనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అండగా నిలవనున్నాడు.

ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్/సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(కీపర్), అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Brisbane India vs Australia latest news Suryakumar Yadav T20 Series Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.