టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్తో ఆడాల్సిన మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు (IND-PAK Boycott) పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీన టీమ్ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచకప్ టోర్నీలో మిగతా మ్యాచ్లను ఆడాలని నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందిస్తూ..
Read Also: Boxer: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్
మాకు ఏది చెబితే అది మాత్రమే మేం చేస్తాం
పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ జట్టు టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. ఇది తమ చేతుల్లో లేని విషయమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20 గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ అఘా.. ప్రభుత్వం, పీసీబీ ఆదేశాలు పాటించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశాడు.

‘మేం ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఆడబోతున్నాం. అయితే భారత్తో ఆడకూడదనేది మా నిర్ణయం కాదు. ఈ విషయంలో మేం ఏం చేయలేం. మా ప్రభుత్వం, పీసీబీ ఛైర్మన్ మాకు ఏది చెబితే అది మాత్రమే మేం చేస్తాం.’అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.మరోవైపు ఈరోజు ఐసీసీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: