हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

రోహిత్ కు ఏమైంది ఫాన్స్ ఆందోళన

Anusha
రోహిత్ కు ఏమైంది ఫాన్స్ ఆందోళన

చాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో జరగబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. వరుసగా రెండు విజయాలు అందుకున్న టీమిండియా, సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు మరో విజయం అవసరమని భావిస్తోంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అకాడమీలో నెట్ ప్రాక్టీస్ చేశారు.

రోహిత్ గైర్హాజరు

ఈ ప్రాక్టీస్ సెషన్‌లో భారత ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆడారు, రన్నింగ్ చేశారు, నెట్ సెషన్‌లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ప్రాక్టీస్ సెషన్‌కు పూర్తిగా హాజరుకాలేదు. దీంతో “రోహిత్ శర్మ ఫిట్‌నెస్ పై సందేహాలు” తెరపైకి వచ్చాయి.

తొడ కండరాల గాయం

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు తొడ కండరాల గాయం ఇబ్బంది పెట్టిందట. అందుకే ఆయన ప్రాక్టీస్ సెషన్‌లో చురుగ్గా పాల్గొనలేదట. ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ భారత ప్రధాన కోచ్ గంభీర్, ఇతర సిబ్బందితో చర్చిస్తూ కనిపించాడు.ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. వారి ఓవర్లలోనే ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. అలాగే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బౌలింగ్ వేశాడు. షమీ వేసిన బంతులు రెండుసార్లు కోహ్లీ ప్యాడ్‌ను తాకాయి. హర్షిత్ రాణా, అర్ష్‌ దీప్ సింగ్ కూడా నెట్స్‌లో చెమటోడ్చారు.

గిల్ గైర్హాజరు

ఈ ప్రాక్టీస్ సెషన్‌లో శుభ్‌మన్ గిల్ హాజరుకాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఆటతీరు కనబరుస్తున్న గిల్ ప్రాక్టీస్‌కు గైర్హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్ తిరిగి జట్టుతో కలిశాడు. ప్రాక్టీస్ సమయంలో ఆయన హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌తో ప్రత్యేకంగా చర్చించుకోవడం గమనార్హం.

no captaincy could be good for rohit sharma

న్యూజిలాండ్ మ్యాచ్‌పై ఫోకస్

మార్చి 2న న్యూజిలాండ్‌ తో జరగబోయే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లోనూ గెలువాలని ఆశపడుతోంది .సెమీ ఫైనల్ చేరేందుకు భారత్ మరో గెలుపును లక్ష్యంగా పెట్టుకుంది.రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడతాడా? లేదా? అనే అంశం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870