📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Harsh Goenka: అమ్మకానికి రెండు ఐపీఎల్‌ టీమ్స్?

Author Icon By Anusha
Updated: November 28, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) వచ్చే సీజన్‌కు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) సంచలన ట్వీట్ చేశారు. రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో పాటు రాజస్థాన్ రాయల్స్‌ కూడా అమ్మకానికి సిద్దంగా ఉందని చెప్పారు.

Read Also: T20 World Cup champions: ప్రధాని మోదీ‌ని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు

ఈ రెండు ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నారని, పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికా‌లో ఎవరికి ఈ జట్లు దక్కుతాయో అని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు (Harsh Goenka). ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారి, క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టులో రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్‌కు 65 శాతం వాటా ఉంది. ఫ్రాంచైజీ సేల్ విషయంపై ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఫ్రాంచైజీ విలువ

ఇదిలా ఉండగా, ఆర్‌సీబీ (RCB) ఫ్రాంచైజీకి ప్రస్తుతం డియాజియో ఇండియా యజమానిగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఆర్‌సీబీ ఫ్రాంచైజీని డియాజియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాంచైజీ విలువ సుమారుగా 2 బిలియన్ల అమెరికా డాలర్లుగా(రూ.17000 కోట్లు) ఉంటుందని అంచనా. డియాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం.

డియాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే యోచనలో డియాజియో ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Harsh Goenka IPL2026 latest news Rajasthan Royals sale RCB sale news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.