
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన అద్భుత ఫామ్తో క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. దేశవాళీ క్రికెట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్లో బరోడా తరఫున ఆడిన హార్దిక్, తన కెరీర్లో తొలి లిస్ట్-ఏ సెంచరీతో చెలరేగిపోయాడు. శనివారం నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో హార్దిక్ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు.
Read also: Mustafizur Rahman: ముస్తాఫిజుర్ ను విడుదల చేసిన KKR
అర్ధశతకం పూర్తి
ఈ మ్యాచ్లో బరోడా జట్టు 20 ఓవర్లలో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ (Hardik Pandya), తొలుత ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చి విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు,
ఒక ఫోర్తో 34 పరుగులు రాబట్టి కేవలం 68 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.మొత్తం 92 బంతులు ఎదుర్కొన్న పాండ్యా, 11 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా బరోడా జట్టు 50 ఓవర్లలో 293 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. పాండ్యా మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లతో రాణించాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: