గాయం తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి తన శైలిని చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బరోడా తరఫున ఆడిన హార్దిక్, తొలి మ్యాచ్లోనే దూకుడుగా ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. కేవలం 42 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును విజయానికి నడిపించాడు. అంతకుముందు బౌలింగ్లో మాత్రం అతనికి ఎక్కువ ప్రభావం చూపించలేకపోయాడు. నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే సాధించాడు.
Read also: Virat Kohli: కోహ్లీకి చిన్నారుల ఘన స్వాగతం.. వీడియో వైరల్!
Hardik has made a splash in batting
మూడు నెలలుగా జట్టు దూరమైన పాండ్యా
శ్రీలంక మ్యాచ్లో గాయపడి మూడు నెలలుగా జట్టుకు దూరమైన పాండ్యా, తాజాగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ట్రైనింగ్ పూర్తిచేసుకుని, బోర్డు నుంచి అనుమతి పొందిన తర్వాత బరోడా జట్టుతో చేరాడు. అతని సోదరుడు కృనాల్ పాండ్యా కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచ్ పునరాగమనానికి సరైన వేదికగా మారింది.
పంజాబ్ ముందుగా 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో హార్దిక్ 7 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆడుతూ మ్యాచ్ను బరోడా వైపు తిప్పాడు. ఐదు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది. త్వరలో ప్రకటించనున్న దక్షిణాఫ్రికా టీ20 జట్టులో చోటు దక్కే అవకాశాలను ఈ ప్రదర్శన మరింత బలపరిచింది.
హార్దిక్ పాండ్యా ఎంతకాలం తర్వాత మైదానంలోకి చేరాడు?
దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత తిరిగి బరిలోకి దిగాడు.
పంజాబ్పై హార్దిక్ ఎంత పరుగులు చేశాడు?
42 బంతుల్లో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: