లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా (South Africa) జట్టు చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను (Australia) ఓడించి టైటిల్ గెలుచుకుంది. గెలుపుతో ‘చోకర్స్’ అనే ముద్రను చెరిపేసింది. మౌనంగా ఎదురుచూసిన 27 ఏళ్ల కల నెరవేరింది.తెంబ బవుమా తన ఆత్మవిశ్వాసంతో జట్టును నడిపించాడు. ఆటగాళ్లపై నమ్మకం పెట్టి తనదైన శైలిలో నాయకత్వం చూపించాడు. విజయం అనంతరం అతని విక్టరీ సెలబ్రేషన్ ఓ రేంజ్లో కనిపించింది.కగిసో రబడా 9 వికెట్లతో ఆట మోమెంట్ను మార్చాడు. ఎడెన్ మర్క్రమ్ 136 పరుగుల శతకంతో చెలరేగాడు. బవుమా కూడా 66 పరుగుల ఇన్నింగ్స్తో జట్టును నిలబెట్టాడు.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు నిడివి ఇన్నింగ్స్తో చీల్చి పారేశారు. పేసర్ల ధాటిని భయపడకుండా బవుమా, మర్క్రమ్ ఎదుర్కొన్నారు. వారి భాగస్వామ్యం 147 పరుగులు చేరింది.
భారత దిగ్గజాల రికార్డును చెరిపేసిన జోడీ
లార్డ్స్ మైదానంలో వీరిద్దరి భాగస్వామ్యం భారత దిగ్గజాలు అగార్కర్, వీవీఎస్ల రికార్డును అధిగమించింది. నాలుగో స్థానానికి నెట్టేసింది.
బవుమా గదాన్ని పైకి ఎత్తిన సందర్బం
విజయానంతరం బవుమా ఐసీసీ ఛైర్మన్ జై షా నుంచి ట్రోఫీ స్వీకరించాడు. దాన్ని చేతుల్లోకి ఎత్తి గన్ పేలుస్తున్నట్లుగా సెలబ్రేట్ చేశాడు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.విజయం తర్వాత మర్క్రమ్ ఓ అభిమాని ఇచ్చిన బీరు తాగాడు. దాంతో అతనికి ఏం అవుతుందా? అంటూ చర్చ మొదలైంది. కానీ మర్క్రమ్ వెంటనే స్పందించాడు. బీరు ఇచ్చిన వ్యక్తి తన స్కూల్ ఫ్రెండ్ అని చెప్పాడు.ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచ క్రికెట్కు మరోసారి తాము సిద్ధమేనని చాటింది.
Read Also : Air India : విమానంలో సాంకేతిక సమస్య : నరకం చూసిన ప్రయాణికులు