18 ఏళ్ల భారతీయ క్రీడాకారిణి శీతల్ దేవి (Sheetal Devi)తన అద్భుత ప్రతిభతో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఈ క్రీడాకారిణి సాధారణ పరిస్థితుల్లోనే కాక, శారీరక సవాళ్లను అధిగమిస్తూ విజయం సాధించడం మరింత చరిత్రాత్మకంగా మారింది. రెండు చేతులు లేకపోయినప్పటికీ, శీతల్ దేవి తన కాళ్ల ద్వారా బాణాన్ని వదిలి, పారా ప్రపంచ ఆర్చరీ పోటీల్లో ( Para World Archery Championships)స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
Amit Mishra: ఫైనల్ లో మనమే గెలుస్తాం: అమిత్ మిశ్రా
టర్కీకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి (Number one player) జోజ్నుర్ క్యూర్ గిర్డీ (Joznur Cure Girdi) పై 146-143 పాయింట్లతో విజయం సాధించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కేటగిరీలో శీతల్ దేవి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నది.పారా వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో శీతల్ దేవి ఒక్కరే చేతులు లేని క్రీడాకారిణి. ఆ దివ్యాంగ క్రీడాకారిణి .. గ్వాంగ్జులో అందర్నీ స్టన్ చేసింది.
తన పాదం, గదవతో .. శీతల్ తన బాణాన్ని షూట్ చేస్తుంది. ప్రపంచ చాంపియన్షిప్లో మూడోసారి శీతల్ దేవి మెడల్ను గెలుచుకున్నది. మిక్స్డ్ టీమ్ బ్రాంజ్ కాంపౌండ్ ఈవెంట్ (Mixed Team Bronze Compound Event) లో తోమన్ కుమార్తో కలిసి పతకాన్ని సాధించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: