మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో ఘనవిజయం సాధించి, ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ విజయంతో భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు ఉత్సాహంతో మునిగిపోయారు. ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిమానులను అలరించే హామీ ఇచ్చారు. భారత్ ఫైనల్ గెలిస్తే పాట పాడతానని, అంతేకాదు టీమిండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్తో కలిసి ఆ పాట పాడతానని ప్రకటించారు.
Read Also: T20 match: భారత్ ఆలౌట్..ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే?
ఈ సందర్భంగా గవాస్కర్ (Sunil Gavaskar) మాట్లాడుతూ, ‘‘ఒకవేళ భారత్ వరల్డ్ కప్ గెలిస్తే, నేను జెమీమాతో కలిసి పాట పాడతాను. ఆమె అద్భుతంగా గిటార్ వాయిస్తుంది. ఆమె గిటార్ వాయిస్తుంటే నేను సింగర్గా మారతాను’’ అని అన్నాడు. అయితే దీనికి ఆయన ఓ చిన్న షరతు కూడా పెట్టాడు.
‘‘ఈ ముసలాయనతో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి జెమీమా (Jemima Rodrigues) కు ఇష్టమైతేనే ఇది సాధ్యం’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.గతంలో వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే.
మహిళల జట్టు కప్ గెలిస్తే
2024లో జరిగిన బీసీసీఐ (BCCI) అవార్డుల కార్యక్రమంలో జెమీమా గిటార్ వాయించగా, గవాస్కర్ ఆమెకు తోడుగా గొంతు కలిపాడు. అప్పటి సంఘటనను గుర్తుచేసుకుంటూ, మళ్లీ అలాంటి ప్రదర్శన ఇస్తామని గవాస్కర్ అభిమానులకు హామీ ఇచ్చాడు.భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు గవాస్కర్ మైదానంలోనే డ్యాన్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడు మహిళల జట్టు కప్ గెలిస్తే పాట పాడతానని చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో టీమిండియా గెలిచి, గవాస్కర్-జెమీమా జుగల్బందీని చూడాలని అందరూ కోరుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: