Sunil Gavaskar : భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై చివరి నిమిషంలో రాజకీయ డ్రామాలు సృష్టించడం ఏమాత్రం సమంజసం కాదని భారత క్రికెట్ దిగ్గజం Sunil Gavaskar తీవ్రంగా మండిపడ్డారు. 2026 టీ20 వరల్డ్కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన “బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు”గా అభివర్ణించారు. ఇలాంటి చర్యలను International Cricket Council అస్సలు సహించకూడదని స్పష్టం చేశారు.
టోర్నీ ప్రారంభానికి ముందు లేదా మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతర జట్లపై కూడా ప్రభావం పడుతుందని గవాస్కర్ అన్నారు. కేవలం పాయింట్లు కోత విధించడం సరిపోదని, పాక్ బోర్డుపై ఆర్థికపరమైన జరిమానాలు, వార్షిక ఆదాయం నిలిపివేత, భవిష్యత్తులో హోస్టింగ్ హక్కుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
అంతేకాకుండా, Pakistan national cricket team పై గట్టి సందేశం వెళ్లేలా విదేశీ ఆటగాళ్లకు లీగ్లలో పాల్గొనే అనుమతులను కూడా పునర్విమర్శించాలని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏ దేశం కూడా ఇలాంటి సాహసం చేయకుండా ఉండాలంటే ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందేనని గవాస్కర్ హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: