సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్–ఆస్ట్రేలియా సిరీస్లో జరిగిన తుదీ వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన చివరి వన్డే మ్యాచ్లో యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్, ఈ చివరి మ్యాచ్లో 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Virat Kohli: వన్డే క్రికెట్లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
అయితే, ఈ అద్భుత ప్రదర్శన వెనుక జట్టు చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఇచ్చిన “పర్ఫామ్ చెయ్, లేదంటే బయట కూర్చోబెడతా” అని గట్టిగా హెచ్చరించినట్లు హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శర్వన్ వెల్లడించారు. గంభీర్ నుంచి వచ్చిన ఆ సందేశమే హర్షిత్ను ((Harshit Rana))ఉత్సాహపరిచి, అత్యుత్తమ ప్రదర్శన చేసేలా ప్రేరేపించిందని శర్వన్ తెలిపారు.
ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన హర్షిత్ రాణాపై సిడ్నీ వన్డేకు ముందు తీవ్ర ఒత్తిడి, విమర్శలు ఉండేవి. సీనియర్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో అతన్ని ఎంపిక చేయడంపై కూడా చర్చ జరిగింది. గంభీర్ మనిషి అని హర్షిత్ను చాలా మంది ట్రోల్ చేశారు. అయితే అతను ఏ విమర్శలకు బహిరంగంగా స్పందించలేదు.
హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు
ఎట్టకేలకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై 8.4 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. అతని పేస్, బౌన్స్ ముందు ఆస్ట్రేలియా 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో హర్షిత్ రాణాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన కఠినమైన సందేశమే ముందుకు నడిపించిందని అతని చిన్ననాటి కోచ్ శర్వన్ వెల్లడించారు. హర్షిత్ తనకు ఫోన్ చేసి, తన ప్రదర్శనతో బయటి విమర్శకులను ఆపాలని అనుకుంటున్నట్లు చెప్పాడని శర్వన్ తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: