పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బీసీసీఐపై తీవ్రంగా మండిపడ్డాడు. బీసీసీఐ (BCCI) ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపించాడు.ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనుంది. గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో భారత్-పాక్ మ్యాచ్ను రద్దు చేయడాన్ని కనేరియా గుర్తు చేశాడు.భారత ఆటగాళ్లు డబ్ల్యూసీఎల్ను బహిష్కరించారు. దేశభక్తి పేరుతో ఆడలేదు. కానీ ఇప్పుడు ఆసియా కప్లో పాకిస్థాన్తో ఆడటానికి ఎలా అంగీకరిస్తున్నారు? అని ప్రశ్నించాడు.అతను ఇంకా, క్రీడను క్రీడగానే చూడాలి. దేశభక్తిని మీకు అనుకూలంగా ఉపయోగించడం ఆపాలి అని అన్నారు.

బీసీసీఐ విధానంపై విమర్శ
ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం తర్వాతే భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్లో చేర్చారని కనేరియా పేర్కొన్నాడు. బీసీసీఐ స్థిరమైన విధానాన్ని అనుసరించాలని సూచించాడు.
దేశభక్తి స్థిరంగా ఉండాలని సూచన
దేశభక్తి అంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఒకసారి కాదు, ఎప్పటికీ ఒకే విధంగా ఉండాలి. తరచుగా వైఖరిని మార్చుకోవడం సరికాదు” అని కనేరియా అన్నారు.భారత్ ప్రధాన టోర్నమెంట్లలో పాల్గొనకపోతే టీవీ హక్కులు, స్పాన్సర్షిప్లు, వ్యూయర్షిప్ దెబ్బతింటాయని కనేరియా హెచ్చరించాడు.
Read Also : Shubman Gill : ఓల్డ్ ట్రాఫర్డ్ లో గిల్ సెంచరీ