📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Rinku Singh: తండ్రికి క్యాన్సర్.. అయినా జట్టు కోసం చెన్నైకి చేరుకున్న రింకూ

Author Icon By Anusha
Updated: February 25, 2026 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rinku Singh: టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందు టీమిండియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ తన తండ్రి అనారోగ్యం కారణంగా నోయిడాకు వెళ్లినప్పటికీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా తిరిగి చెన్నైకి బయలుదేరారు. రింకూ తండ్రి ప్రస్తుతం స్టేజ్-4 లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, దేశం కోసం ఆడేందుకు ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Read Also: New Zealand vs Zimbabwe: న్యూజిలాండ్ వేదికగా కివీస్-జింబాబ్వే పోరు!

జట్టు సమతుల్యత కోసమే మేనేజ్‌మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు

లోయర్‌ ఆర్డర్‌లో రింకూ సింగ్ లేకపోతే జట్టు సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని బిసిసిఐ (BCCI) భావించింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రింకూ లోయర్‌ ఆర్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్. అతని లేని పక్షంలో శివమ్ దూబేపై ఒత్తిడి పెరిగి, జట్టు సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాగా రింకూ అందుబాటులోకి రావడంతో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కడంపై సందిగ్ధత నెలకొంది.

జింబాబ్వేపై తిరుగులేని రికార్డు
జింబాబ్వే జట్టుపై రింకూ సింగ్‌కు అద్భుతమైన గణాంకాలు ఉన్నాయి. గతంలో ఆ జట్టుతో ఆడిన ఐదు టీ20లలో రింకూ 176.47 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ముఖ్యంగా 2024లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆయన ఆడిన 48 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. లోయర్ ఆర్డర్‌లో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంలో సిద్ధహస్తుడైన రింకూ.. జింబాబ్వే బౌలర్లను గతంలోనే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి పాలైన తర్వాత జట్టు సమీకరణాలు కఠినంగా మారాయి.ఈ నేపథ్యంలో రింకూ సింగ్ గైర్హాజరు జట్టుపై మానసికంగా కూడా ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే క్రికెట్ కంటే కుటుంబ పరిస్థితికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో రింకూ సింగ్ కుటుంబానికి క్రికెట్ ప్రపంచం మద్దతుగా నిలుస్తోంది. అభిమానులు కూడా అతని తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Father Illness India vs Zimbabwe T20 World Cup 2026 Rinku Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.