ENG vs PAK: టీ20 ప్రపంచకప్లో అత్యంత కీలకమైన సూపర్-8 దశలో ఇంగ్లాండ్ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మంగళవారం పాకిస్థాన్తో జరిగిన పోరులో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.
Read Also: LSG logo 2026 : లక్నో జట్టు కొత్త లోగో రిలీజ్, ఎరుపు రంగు హాట్ టాపిక్!
హారీ బ్రూక్ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్: ఆకాశమే హద్దుగా బాదుడు
ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (0), జోస్ బట్లర్ (2) ఘోరంగా విఫలమయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్ను నడిపించాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు.అయితే బ్రూక్ సెంచరీ తర్వాత ఔటవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. ఆ వెంటనే నవాజ్ బౌలింగ్ లో విల్ జాక్స్ (28), జేమీ ఓవర్టన్ (0) కూడా ఒకే ఓవర్లో వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

ఒకానొక దశలో పాకిస్థాన్ గెలుస్తుందనిపించింది. కానీ చివర్లో జోఫ్రా ఆర్చర్ (5) కీలక బౌండరీ బాదడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 4 వికెట్లతో సత్తా చాటాడు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ధ సెంచరీతో రాణించాడు. బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తీశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: