ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో ఇవాళ ఫాన్స్కు డబుల్ ధమాకా మామూలుగా ఉండబోదు. మొదటి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరియు ముంబై ఇండియన్స్ (MI) తలపడనుండగా, ఇరు జట్ల మధ్య గడిచిన ఏడుసార్ల పోరులో లక్నో 6 విజయాలను సాధించి స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది. ముంబై కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముంబై రివెంజ్ కోసం బరిలో దిగుతుందా? లేక లక్నో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలా అనేది ఆసక్తికరంగా మారింది.
బెంగళూరు vs ఢిల్లీ – రాత్రి ఢిల్లీ వేదికగా ఉత్కంఠ పోరు
రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య ఈ పోరు ఫ్యాన్స్ను ఉత్కంఠకు గురిచేయనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 32 సార్లు తలపడగా, బెంగళూరు 19 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఢిల్లీ 12 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. ఇటీవల బెంగళూరు తడబడుతున్నప్పటికీ, ఢిల్లీ కూడా స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేక పోతోంది. అందుకే ఈ మ్యాచ్ ఇద్దరికి అత్యంత కీలకంగా మారింది.
ఫాన్స్ కోసం ఉత్కంఠ భరితమైన రోజు
ఈరోజు జరగనున్న రెండు మ్యాచ్లు ఐపీఎల్ అభిమానులకు పూర్తిస్థాయి మజాను అందించనున్నాయి. లక్నో తమ గెలుపు పరంపరను కొనసాగిస్తుందా లేదా ముంబై తిరిగి రాణిస్తుందా అనేది చూడాల్సి ఉంది. అలాగే బెంగళూరు తన విజయాల సంఖ్యను పెంచుకోవడమా, లేక ఢిల్లీ మళ్లీ విజయబాట పట్టడమా అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నాయి. రెండు మ్యాచ్ల ఫలితాలు ప్లే ఆఫ్స్ ఆశలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో, ఇవాళ ఐపీఎల్ ఉత్సాహం తారాస్థాయికి చేరనుంది.
Read Also : Diabetes: ఉదయం ఖాళీ కడుపుతో ఇది తాగితే మధుమేహం పరార్