📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Corbin Bosch: ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు పీసీబీ నోటీసులు

Author Icon By Sharanya
Updated: March 17, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబయి ఇండియన్స్ (MI) ఆల్‌రౌండర్ కార్బిన్ బోష్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి లీగల్ నోటీసులు అందుకున్నాడు. ఈ నిర్ణయం పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీలను ఆశ్చర్యానికి గురిచేసింది. బోష్ ముందుగా పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు, కానీ అనూహ్యంగా ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకోవడంతో వివాదం తలెత్తింది.

ఒప్పందాల ఉల్లంఘనపై పీసీబీ ఆగ్రహం

దక్షిణాఫ్రికాకు చెందిన బోష్ ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తోనే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో అతడి ప్రదర్శన ఆకట్టుకోవడంతో పెషావర్ జల్మీ జట్టు పీఎస్‌ఎల్ 10వ సీజన్ ప్లేయర్ డ్రాఫ్ట్ సందర్భంగా అతడిని కొనుగోలు చేసింది. జనవరి 13న లాహోర్‌లో జరిగిన డ్రాఫ్ట్‌లో అతడు ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఐపీఎల్ 2024 మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ గాయపడడంతో, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు బోష్‌ను ఎంపిక చేసింది. దీంతో బోష్ పీఎస్‌ఎల్ ఒప్పందాన్ని పక్కనపెట్టి ఐపీఎల్‌లో చేరడం పీసీబీ ఆగ్రహానికి కారణమైంది.

పీసీబీ నోటీసుల పంపిణీ

ఈ పరిణామాల నేపథ్యంలో పీసీబీ బోష్‌కు లీగల్ నోటీసులు జారీ చేసి, అతను పీఎస్‌ఎల్ ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘించాడో వివరణ ఇవ్వాలని కోరింది. ఒకవేళ బోష్ నుంచి సరైన సమాధానం రాకపోతే, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పీఎస్‌ఎల్ 2016లో ప్రారంభమైంది. సాధారణంగా పీఎస్‌ఎల్, ఐపీఎల్ కంటే ముందుగా జరగడం పరిపాటిగా ఉంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా పీఎస్‌ఎల్ ఆలస్యం అయింది. ఇక ఐపీఎల్ ఈ నెల 22న ప్రారంభంకానుండగా, దానికి రెండు వారాల తర్వాత పీఎస్‌ఎల్ మొదలుకానుంది. ఈ తేడా వల్లే బోష్ ఐపీఎల్‌ను ప్రాధాన్యతనిచ్చి పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, క్రికెటర్ల ఒప్పందాలను ఉల్లంఘించడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆమోదయోగ్యం కాదు. దీంతోనే పీసీబీ బోష్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు ముందుకొచ్చింది.

ఐపీఎల్ 2025 – ముంబయి ఇండియన్స్ కొత్త ప్రణాళిక

ఇక ఐపీఎల్ 2025 మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ముంబయి ఇండియన్స్ బోష్‌ను తీసుకోవడం అది జట్టుకు ఎంతవరకు లాభదాయకమో చూడాలి. ఇదిలా ఉండగా, పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీల నష్టాన్ని పీసీబీ ఎలా ఎదుర్కొంటుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

#BCCI #CorbinBosch #CricketControversy #CricketNews #IPL2025 #IPLUpdates #LegalNotice #MI #mumbaiindians #PCB Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.