📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News:  Messi: మెస్సీతో మ్యాచ్‌.. సన్నద్ధం అవుతున్న సీఎం రేవంత్

Author Icon By Anusha
Updated: December 12, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
CM Revanth is preparing for the match with Messi.

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ (Messi) తో కలిసి ఆడేందుకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవెంట్‌ ‘GOAT Tour to India 2025’ డిసెంబర్ 13న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ టూర్‌లో భాగంగా మెస్సీ (Messi) తో కలిసి స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

Read Also: U-19 ODI Asia Cup: నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఆయన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు

గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫుట్‌బాల్ బూట్లు ధరించి మైదానంలోకి దిగారు. వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఆయన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. జట్టు జెర్సీ ధరించి ఉత్సాహంగా ఆడిన సీఎం, ఈ మ్యాచ్‌పై తన ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఫుట్‌బాల్ అంటే బాగా ఇష్టపడే సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా MCRHRD ఇన్‌స్టిట్యూట్ గ్రౌండ్‌లో వార్మప్ మ్యాచ్ ఆడారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన సన్నాహాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ స్నేహపూర్వక మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి. శివధర్ రెడ్డి గురువారం స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు 39,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ 23 ఎకరాల స్టేడియాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

GOAT Tour to India 2025 Hyderabad Event latest news Messi Revanth Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.