క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్కు రంగం సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ క్రికెట్ మహాయుద్ధానికి వేదిక కానుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Bangalore) (RCB) జట్లు తమ తొలి టైటిల్ కోసం తలపడతాయి.ఈ మ్యాచ్ గెలిచే జట్టుకు ఇదే మొదటి IPL ట్రోఫీ అవడం విశేషం. అంటే, ఈ ఫైనల్ ఒక చరిత్రగా మిగలనుంది. అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
కెప్టెన్ల ఫోటోషూట్కి పెద్ద స్పందన
ఫైనల్కు ముందు, ఇరుజట్ల కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్ (పంజాబ్) మరియు రజత్ పాటిదార్ (బెంగళూరు) ఐపీఎల్ ట్రోఫీతో స్పెషల్ ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. IPL అధికారిక ఖాతా వాటిని అభిమానులతో షేర్ చేసింది.
ఫైనల్కు అర్హత ఎలా పొందారు?
లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన ఈ జట్లు, ప్లేఆఫ్స్లో సత్తా చూపాయి.
RCB, క్వాలిఫయర్-1లో పంజాబ్ను ఓడించి నాలుగోసారి ఫైనల్ చేరింది.
పంజాబ్ కింగ్స్, క్వాలిఫయర్-2లో ముంబైపై గెలిచి ఫైనల్ టికెట్ ఖరారు చేసుకుంది.
ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడు సార్లు తలపడ్డాయి.
కెప్టెన్ల భావోద్వేగాలు
రజత్ పాటిదార్ మాట్లాడుతూ:
ఫైనల్ ఒత్తిడి సహజం. కానీ నేను ప్రస్తుతంపై దృష్టి పెడతాను. మా జట్టు శాంతంగా, దృఢంగా ఉన్నది. మా ఉత్తమ ఆట తడబడకుండా ప్రదర్శించాలన్నదే లక్ష్యం.ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. మా ప్రయాణం అద్భుతంగా సాగింది. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ మిగతా దశ పూర్తిచేయాలన్నది నా ఆలోచన.కెప్టెన్ల ఆత్మవిశ్వాసం, జట్ల గట్టి ప్రదర్శనల నేపథ్యంలో. ఈ ఫైనల్ పోరు హోరాహోరీగా సాగనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – ఎవరూ గెలుస్తారు?
Read Also : Gukesh : గుకేష్కు మోదీ, చంద్రబాబు అభినందనలు