(Karnataka) బెంగళూరులోని ప్రసిద్ధ ఎం.చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు రేపటితో తెరపడే అవకాశం ఉంది. గురువారం (డిసెంబర్ 11) జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. బుధవారం బెలగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Also: T20 2026: JioHotstar వైదొలగడానికి కారణాలు ఇవేనా..?
రాష్ట్ర గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం
అంతకుముందు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఇతర నూతన కార్యవర్గ సభ్యులు శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, “క్రికెట్ మ్యాచ్లను ఆపాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ, ప్రేక్షకుల నిర్వహణ, భద్రతా చర్యలను తప్పకుండా పరిశీలించాల్సి ఉంది.
జస్టిస్ మైఖేల్ డి’కున్హా కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి వెంకటేశ్ ప్రసాద్ కూడా అంగీకరించారు” అని వివరించారు. క్రికెట్ అభిమానుల మనోభావాలను గౌరవిస్తూనే, రాష్ట్ర గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.”ఐపీఎల్ అయినా, మరే ఇతర మ్యాచ్ అయినా బెంగళూరు నుంచి తరలించడానికి మేం అంగీకరించం.
ప్రభుత్వం, కేఎస్సీఏ (KSCA) కలిసి పనిచేయాలి. అవసరమైతే కొత్త స్టేడియాల నిర్మాణం గురించి కూడా చర్చిస్తాం” అని శివకుమార్ పేర్కొన్నారు. జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాల మద్దతుతో ఎన్నికైన వెంకటేశ్ ప్రసాద్ బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: