వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తొలి ఇన్నింగ్స్లో 258 బంతుల్లో 175 పరుగుల ఘన ఇన్నింగ్స్ ఆడాడు..యశస్వి జైస్వాల్ యొక్క మెరుపు బ్యాటింగ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆసక్తి సృష్టిస్తోంది.యశస్వి జైస్వాల్ మెరుపు బ్యాటింగ్ను చూసి విస్మయం చెందిన వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా (Brian Laura).. ఈ యువ ఓపెనర్ను ప్రత్యేకంగా అభ్యర్థించాడు.
Sachin Tendulkar: సచిన్ జోస్యం.. ఇప్పుడు నిజమవుతుందా?
దయచేసి తమ బౌలర్లపై కాస్త కరుణ చూపించమని లారా (Brian Laura) జైస్వాల్ను కోరాడు.అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో వెస్టిండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 518 పరుగులు చేసింది. బీసీసీఐ ఆదివారం ఉదయం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఓ వీడియోను పంచుకుంది.
అందులో లారా జైస్వాల్ను ఆప్యాయంగా కౌగిలించుకుని అభినందించారు.అనంతరం లారా జైస్వాల్ను ఉద్దేశించి, “మా బౌలర్లను అంతలా బాదకు” అంటూ ప్రత్యేక విజ్ఞప్తి చేయడం గమనార్హం.
ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తా
వెస్టిండీస్ బౌలర్ల ముందు జైస్వాల్ స్టైలిష్ షాట్లతో రెచ్చిపోవడంతో లారా ఈ విధంగా సరదాగా కోరినట్లు తెలుస్తోంది.జైస్వాల్ ఈ మ్యాచ్లో తన మూడో డబుల్ సెంచరీ (Double century) ని తృటిలో కోల్పోయాడు. డబుల్ సెంచరీ మిస్సయినందుకు తాను చింతించడం లేదని, ఇదంతా ఆటలో భాగమని జైస్వాల్ పేర్కొన్నాడు.
బ్యాటింగ్ సమయంలో తన ఆలోచనా విధానం గురించి యశస్వి జైస్వాల్ మాట్లాడారు. తాను ఎప్పుడూ వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.”నేను ఎప్పుడూ జట్టుకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నా జట్టు కోసం నేను ఎలా ఆడగలను, ఆ సమయంలో జట్టుకు ఏది ముఖ్యం అని ఆలోచిస్తాను.
వికెట్ ఎలా ఉంది, నేను అక్కడ ఉన్నప్పుడు, వీలైనంత ఎక్కువసేపు ఉండేలా చూసుకుంటాను. అందుకే నాకు మంచి ఆరంభం లభిస్తే, దానిని పెద్ద ఇన్నింగ్స్గా మార్చేలా చూసుకుంటాను. ఇదే నా ఆలోచన” అని జైస్వాల్ వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: