భారత బాక్సింగ్ (Boxer) క్రీడలో లెజెండ్గా గుర్తింపు పొందిన మేరీకోమ్ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన వైవాహిక బంధంపై స్పష్టత ఇస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు క్రీడా లోకంతో పాటు సామాజిక వర్గాల్లోనూ విస్తృత చర్చకు దారితీశాయి. చాలా ఏళ్లుగా తమ బంధం సజావుగా సాగిందని, అయితే తన భర్త ఆర్థికంగా మోసం చేయడంతోనే తమ బంధం చెడిపోయిందని ఆమె తెలిపారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రకరించారని, ఈ విషయంలో ఎవరైనా బాధపడితే క్షమించాలంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.
Read Also: Viral Video: పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..
వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన భావోద్వేగ క్షణం
తన మాజీ భర్తను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, ఇతరులను కాదని ఆమె స్పష్టం చేశారు. ఫుట్బాల్ క్రీడాకారులను కించపరిచాననే ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. “నాకు ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం. సునీల్ ఛెత్రి, బైచుంగ్ భూటియా వంటి వారు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. నా మాజీ భర్త తన ఫుట్బాల్ కెరీర్ను నా కోసం త్యాగం చేశానని చెప్పారు.కానీ, అతను షిల్లాంగ్లో ఫుట్బాల్ ఆడటం మానేసిన చాలా కాలం తర్వాతే ఢిల్లీలో నన్ను కలిశారు” అని మేరీ కోమ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఒక సిద్ధాంతంగా చూడవద్దని, అది కేవలం తన వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన భావోద్వేగ క్షణమని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: