పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్న ‘GOAT టూర్’ ఈవెంట్లో తలెత్తిన తీవ్ర గందరగోళం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో.. క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ (Arup Biswas) మంగళవారం రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి అందజేశారు.
Read Also: IPL 2026 Mini Auction: పృథ్వీ షా అన్సోల్డ్
అరూప్ బిశ్వాస్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది
అరూప్ బిస్వాస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తులలో ఒకరు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో శక్తివంతమైన నాయకుడిగా (Arup Biswas) ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: