సెంట్రల్ కాంట్రాక్ట్ (2025-26) విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (RO-KO) లకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు A+ కేటగిరీలో ఉన్న వీరిద్దరినీ గ్రేడ్ Bలో చేర్చింది. రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుమ్రా, గిల్, జడేజాను మాత్రమే గ్రేడ్ Aలో ఉంచింది.
Read Also: Ranji Trophy 2026 : 299 వద్ద ఔట్, ట్రిపుల్ సెంచరీ మిస్! రంజీలో అరుదైన ఘటన
గ్రేడ్ ‘సి’
గ్రేడ్ ‘సి’లో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దుబే, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.
మహిళల టీమ్లో గ్రేడ్ ‘ఏ’లో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు, గ్రేడ్ ‘బీ’లో రేణుక ఠాకూర్, షెఫాలీ వర్మ, రిచాఘోష్, స్నేహ్ రాణా చోటు దక్కించుకున్నారు. గ్రేడ్ ‘సీ’ జాబితాలో రాధాయాదవ్, అమన్ జ్యోత్ కౌర్, ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, జి. కమలిని, వైష్ణవి శర్మ, తేజస్ హసబ్నిస్ ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: